నార్సన్నపల్లి గ్రామం కామారెడ్డి మండలం లో నిజామాబాదు జిల్లా కేంద్రం కు 54 కీ మీ దురమ లో తెలంగాణా లో కేంద్రీకృతం అయీనది .నర్సన్నపల్లి కి సరిహద్దులు గ పొందుర్తి , చిన్నమల్లారెడ్డి మరియు క్యాసంపల్లీ అను గ్రామాలతో ఉన్నది . కామారెడ్డి , నిజామాబాదు , సిరిసిల్ల , మెదక్ వంటి నగరాలూ ఈ ఊరికి దేగ్గరలో ఉన్నవి . నర్సంనపల్లీ గ్రామలో ముక్యంగా తెలుగు ప్రామాణిక బాష గా ఉంది . నర్సన్నపల్లి జనాబా 2014 గాను 3500 కు పైగా ఉంది . ఈ గ్రామం అక్షరాస్యత 61% గా ఉంది .
నర్సన్నపల్లి కి చేరుకోవడానికి కామారెడ్డి పట్టణం నుండి అనేక బస్సు సౌకర్యాలు , ఆటో సౌకర్యాలు ఉన్నవి . అలాగే కామారెడ్డి పట్టణం లో రైల్ సౌకర్యం తో కూడా ఇతర ప్రాంతాలనుండి ఇక్కడికి చేరుకోవచ్చు ,నర్సన్న పల్లి గ్రామం చరిత్రా పరంగా ఏవిదమైన ఊనికి లేకపోయెన ప్రస్తుతం పట్టాన కేంద్రం లో ఒక ప్రత్యేక స్తానం సంపాదించింది .ఇక గ్రామం విషయానికి వస్తే వ్యవసాయ ఆధారిత గ్రామం గా పిలువబడుతుంది . గ్రామం లో ని సగం జనాబా వ్యవసాయం , మరియు వ్యవసాయ కూలీలుగా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు . ఇ గ్రామం లో ముఖ్య పంటలుగా వరి , చెరుకు , మొక్కజొన్న , వంటివి పండిస్తుంటారు , అలగే వ్యవసాయ అనుసందనమైన పాడి పరిశ్రమ కూడా ఈ గ్రామం లో నిర్వహిస్తూ రైతులు తమ జీవనాన్ని సాగిస్తున్నారు . గ్రామా అవసరాలు నీటి సౌకర్యాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వ్యవసాయం పరంగా మాత్రం అంత మాత్రంగానే నీటి పారుదల అందుబాటులో ఉంది , వర్షా ఆదరమైన పంటలు మాత్రమే ఎక్కువగా ఇక్కడ పండించటం జరుగుతుంది , వ్యవసాయ దారులు వారు పండించిన పంటలను కామారెడ్డి పట్టణం లో తరలించి వారి ఆవాస రాలు తిర్చుకున్తున్నారు , ఇ గ్రామానికి రావణా సౌకయం అత్యంత విశాలంగా ఉంది కావున పరిశ్రమలకు అత్యంత అనుకూలమైనది , ఇ గ్రామం లో ఎక్కువగా హిందువులు తరువాత తక్కువ సంక్యలో ముస్లిమ్స్ ఉన్నారు , పురాతన గుడిలు ఇక్కడ ఉన్నవి . ప్రతి 5 ఏండ్ల కు ఒక సారి పెద్దమ్మ జాతర గనంగా నిర్వహించ బడుతుంది ఇ గ్రామంలో ముఖ్యంగా ఉగాది , దసరా ,దీపావళి , గణేష్ చతుర్ది , బతుకమ్మ వంటి పండగలు చాల ఆర్భాటంగా జరుపుతారు . గ్రామలో ని యువత కలిసికట్టుగా పండగలకు ఒక కొత్త శోభను తీసుకువచ్చే విదంగా వీటిని నిర్వహించందం జరుగుతుంది . ఇక చదువు విషయానికి వస్తే అక్షరాస్యత 61% సగా ఉంది . గ్రామలో ప్రబుత్వ పాటశాలలో విద్యార్థులు విద్యాబ్యాసం కొనసాగిస్తున్నారు . ఇ గ్రామం లో నూతనంగా పాటశాల భవనం ఏర్పాటు చేయబడింది . విద్యార్థులు పై చదువుల కై దెగ్గర లో గల కామారెడ్డి పట్టణం లో తమ ఉన్నత చదువు కొనసాగించటానికి ఇతర విద్య విషయయలు కామారెడ్డి పట్టణం లో నేర్చుకోవడం జరుగుతుంది , మరి కొంత మంది విద్యార్థులు హైదరాబాద్ పట్టణం లో ఉన్నత చదువు సాగీస్తున్నారు , పరిశ్రమల విషయం లో ఇ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి సాదించటం జరుగుతుంది . గ్రామ ని కి దేగ్గరలో తెలంగాణా లో నే విశిష్ట మైన విజయ పాల పరిశ్రమ చాల గణనీయమైన అభివృద్ధి సాధించించి ఎందరో నిరుద్యోగులు దానిని ఆసరా గ చేసుకొని జీవనం సాగిస్తున్నారు . మరియు ఒక పెద్ద విద్యుత్ ఉప కేంద్రం కూడా ఇక్కడ స్తపించాబడి చాలామంది ఉపాది పొందుతున్నారు . గ్రామ లో పండగలు చాల గనంగా జరుపుకుంటారు . నర్సన్నాపల్లీ గ్రామం మరియు చిన్నమల్లారెడ్డి గ్రామం సంయుక్తంగా గ్రామని కి దేగ్గరలో గల చెరువు లో భాగస్వాములుగా ఉన్నారు .
|